Sunday, April 28, 2024

ADB: వారియర్స్ తో ఇక సైబర్ నేరాలకు చెక్… ఎస్పీ గౌష్ ఆలం

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్కరి చొప్పున సైబర్ వారియర్స్ ను నియమిస్తున్నట్టు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈరోజు సైబర్ వారియర్స్ కి ప్రత్యేకంగా ఒక సెల్ ఫోన్ సిమ్ కార్డు అందజేసి సైబర్ బాధితులకు అండగా ఉండాలని తెలియజేశారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 ఫోన్ నెంబర్ కు కానీ, ఎన్ సీఆర్ బీ పోర్టల్ లో గాని, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను కానీ సంప్రదించాలని సూచించారు.

సైబర్ నేరం ద్వారా మోసపోయిన డబ్బును త్వరగా ఇప్పించే విధంగా నూతన పద్ధతిని సైబర్ వారియర్స్ కు తెలియజేయడం జరిగిందని, పూర్తి అవగాహనతో కోర్టు ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఇదివరకే సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే సైబర్ వారియర్స్ వీలైనంత త్వరగా డబ్బులు తిరిగివచ్చే విధంగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బి సురేందర్రావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్, సైబర్ సెల్ ఇంచార్జ్ సింగజ్ వార్ సంజీవ్ కుమార్, ఎం ఏ రియాజ్, జిల్లా సైబర్ సెల్ వారియర్స్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement