Thursday, May 2, 2024

TS | స్కూటీని ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి

కౌడిపల్లి (ప్రభ న్యూస్) : మెదక్ జిల్లాలో ఇవ్వాల (శుక్ర‌వారం) ఉద‌యం యాక్సిడెంట్ జ‌రిగింది. కౌడిపల్లి మండలం తునికి గ్రామ సమీపాన స్కూటీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చ‌నిపోయారు. ఒకరికి స్వల్ప గాయాల‌య్యాయి. ఉత్తర ప్రదేశ్ కు చెందిన దోహి, సరోజ్, కెన్యా రెడ్డిపల్లి గేటు వద్ద సిమెంట్ పనులు చేస్తుంటారు.

వీరు ముగ్గురు స్కూటీపై వెంకట్రావుపేట్ వెళ్లి నిత్యవసర సరుకులు తీసుకొని రెడ్డిపల్లికి తిరిగి వ‌స్తున్నారు. కాగా, తునికి గేటు సమీపంలో నర్సాపూర్ నుండి మెదక్ వైపు వెళ్తున్న కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో దోహి (26), సరోజ్ (30) సంఘటన స్థలంలోనే చ‌నిపోయారు. కెన్యాకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement