Sunday, May 5, 2024

బైకును ఢీకొట్టిన కారు, అక్క‌డిక‌క్క‌డే ఒక‌రు మృతి.. రంగారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌

కందుకూరు, (ప్రభ న్యూస్ ) బైకును కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చ‌నిపోయాడు. మ‌రో ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరులో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం పరిధిలోని పెండ్యాల గ్రామానికి చెందిన డి. శివ (19) మల్లేష్(23) సమరసింహా రెడ్డి (23) శుక్రవారం గుడికి బయలుదేరి వెళ్తున్నారు.

కందుకూరు మండల కేంద్రంలోని నవార్ బాల్ రెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు లైట్లు ఇబ్బంది ఉండ‌డంతో రోడ్డు క‌నిపించ‌లేదు. దీంతో వారు అట్లానే ప్ర‌యాణించ‌డంతో బైకును కారు ఢీకొట్టింది. దీంతో శివ అక్కడికక్కడే చ‌నిపోయాడు. సమరసింహా రెడ్డికి తీవ్ర గాయాలు కాగా, మల్లేష్ కు సల్ప గాయాలయ్యాయి. వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement