Thursday, April 25, 2024

విభ‌జ‌న రాజ‌కీయాలు కాదు-నిర్ణ‌యాత్మ‌క రాజ‌కీయాలు కావాలి-అమిత్ షాకి కేటీఆర్ చుర‌క‌లు

74ఏళ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఇండియ‌న్ యూనియ‌న్ లో క‌లిపేందుకు వ‌చ్చార‌ని కేంద్ర హోమంత్రి అమిత్ షాకి చుర‌క‌లంటించారు మంత్రి కేటీఆర్.ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ఇవాళ‌నేమో ప్ర‌స్తుత కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విభ‌జ‌న చేసేందుకు హైద‌రాబాద్‌కు వ‌చ్చార‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. దేశానికి కావాల్సింది విభ‌జ‌న రాజ‌కీయాలు కాదు.. నిర్ణ‌యాత్మ‌క రాజ‌కీయాలు కావాల‌ని తాను ప‌దే ప‌దే చెప్తున్నాన‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement