రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్గూడకు చెందిన అనీష్ అనే ఏడేళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. గురువారం(అక్టోబర్ 21) నుంచి కనిపించకుండా పోయిన బాలుడు మృతి చెందాడు. ఇంటి వెనుక ఉన్న చెరువులో బాలుడు అనిష్ మృతదేహం లభ్యం అయింది.
గురువారం మధ్యాహ్నం నుంచి అనీష్ కనిపించకుండాపోయాడు. దీంతో అనీష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా అనీష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదర్గూడ పరిసరాలను తనిఖీ చేశారు. దీంతో అపార్ట్మెంట్ వెనుక గల చెరువులో అనీష్ మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో కేసీఆర్ రోడ్ షో.. బహిరంగ సభ రద్దయినట్టే!