Sunday, April 28, 2024

Breaking | రైలు ఢీకొట్టడంతో 50 గొర్రెలు మృతి.. వికారాబాద్​ జిల్లాలో ఘటన

ధారూర్, (ప్రభ న్యూస్): రైలు ఢీకొట్టడంతో 50 గొర్రెలు మృతి చెందిన ఘటన వికారాబాద్​ జిల్లాలో ఇవ్వాల (శనివారం) సాయంత్రం జరిగింది. ధారూర్ రైల్వే స్టేషన్​ సమీపంలో ఈ ఘటన చొటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దోర్నాల గ్రామానికి చెందిన కురువ కిష్టయ్య తన గొర్రెలు మేపడానికి అడవికి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

హుబ్లీ ట్రైన్ వస్తుందని గొర్రెలను రైల్వే ట్రాక్ పక్కన ఆపుకొని నిలబడ్డాడు. అదె సమయానికి పక్కనే చెట్ల పొదల్లోనుంచి అడవి పందులు పారిపోవడంతో గొర్రెలు బెదిరి ఎదురుగా ఉన్న ట్రాక్​ పైకి పరుగెత్తాయి. దీంతో రైలు గొర్రెలను ఢీకొట్టడంతో చనిపోయినట్టు బాధితుడు క్రిష్టయ్య తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement