Saturday, May 18, 2024

Huzurabad Bye-Election: 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పలు గ్రామాల్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.. అనంతరం ఊపందుకుంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదవుతుందని అన్ని పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో 2,37,036 మంది ఓటర్ల ఉన్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Huzurabad bypoll: సాదుకున్నా మీరే.. చంపుకున్నా మీరే: ఈటల భావోద్వేగం

Advertisement

తాజా వార్తలు

Advertisement