Thursday, May 2, 2024

మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కరోన కలకలం

జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముగ్గురు పోలీస్ సిబ్బంది ఇటీవల హుజురాబాద్‌లో సీఎం సభకు వెళ్లారు. సీఎం సభ తర్వాత కానిస్టేబుళ్లు ముగ్గురు కరోనా లక్షణాలు బయట పడ్డాయి. వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో మిగత సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కాగా, బాధితులు రెండు డోసులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement