Friday, April 19, 2024

మహారాష్ట్రాలో ఘోర ప్రమాదం.. 12 మంది కూలీలు దుర్మరణం



మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుల్దానాలో కార్మికులను తరలిస్తున్న ఓ వాహనం బోల్తాపడిన ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. వేగంగా వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టిప్పర్ ఐరన్ లోడుతో ప్రయాణిస్తుండగా, కూలీలు ఐరన్ లోడుపై కూర్చున్నారు. నాగ్‌పూర్‌- ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు’ పనుల కోసం మొత్తం 16 మంది కూలీలను వాహనంలో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఎనిమిది మంది చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా కొందరు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయారని, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు.

ఇది కూడా చదవండిః ఆడపిల్లలపై అరాచకాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్

Advertisement

తాజా వార్తలు

Advertisement