Sunday, April 28, 2024

ఈటలను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది: కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో ఈటల గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుందని అన్నారు. హన్మకొండ జన ఆశీర్వాద యాత్ర లో మాట్లాడిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని విమర్శించారు.

ఆరోపించారు. ప్రజల సొమ్మును తండ్రీకొడుకులు కలిసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఓవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ దాటి బయటికి రావడంలేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో ఇక్కడ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి వివరించారు. నేడు కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర మహబూబాద్ జిల్లా తొర్రూరులోనూ, అనంతరం వర్ధన్నపేట మీదుగా కొనసాగింది. తొర్రూరులో కిషన్ రెడ్డికి టీఆర్ఎస్, దళిత సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కిషన్ రెడ్డిని నిలదీశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement