Friday, March 29, 2024

విద్యార్థులకు సోనూసూద్ బంపర్ ఆఫర్

లాక్‌డౌన్‌లో ఎంతోమందికి సోనూసూద్ ఆపద్భాంధవుడిలా మారారు. ప్రస్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రీల్ లైఫ్‌లో విల‌న్ అయినా.. రియ‌ల్ లైఫ్ హీరోగా జ‌నాల గుండెల్లో నిలిచిపోయారు. కరోనా టైంలో చాలా మందికి ఏం కావాలంటే అది సోనూసూద్‌ సహాయం చేశారు. విపత్తు సమయంలో సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలకు అభినందనలతో పాటుగా.. పలు అవార్డులు ఆయనకు దక్కాయి. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

విద్యార్థుల కోసం హీరో సోనూసూద్ కొత్త ఆఫర్ ప్రకటించారు. యూనివర్సల్ ఎడ్యుకేషన్ సహకారంతో సూద్ ఛారిటీ ఫౌండేషన్ తరపున ముంబైలో ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్, LLB, B.Ed, ఆర్కిటెక్చర్ లాంటి కోర్సులను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇందుకోసం దేశంలో ఎవరైనా https://soodcharityfoundation.org/లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. సోనూసూద్ ఇప్పటికే సీఏ, లా కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. స్కాలర్‌షిప్స్ ఇస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement