Saturday, April 27, 2024

ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

ఔటర్​ రింగ్ ​రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ప్రమాదంలో ముగ్గుర మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్​పల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సైబర్ క్రైమ్ ఏసీబీ ప్రసాద్ కుటుంబసభ్యులుగా గుర్తించారు.

ఇది కూడా చదవండి: వైసీపీ ఖాతాలో కాకినాడ మేయర్ పదవి.. కొత్త మేయర్ ఎవరంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement