Sunday, May 12, 2024

కస్తూర్బాగాంధీ ట్రస్ట్ నుంచి 14 మంది యువతులు పరార్

హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం హైదర్షాకోట్‌లోని కస్తూర్బాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ నుంచి 14 మంది యువతులు పరారయ్యారు. బాత్‌రూమ్‌ కిటికీ ఊచలు ఊచలు తొలగించి.. దాని గుండా బయటకు దూకి పారిపోయారు. మొత్తం 15 మంది యువతులు పారిపోయేందుకు యత్నించగా.. వీరిలో ఒక యువతికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆ యువతి వారితో వెళ్లలేక అక్కడే ఉండిపోయింది. యువతులు పరారైన విషయాన్ని ఈ తెల్లవారుజామున గుర్తించిన ట్రస్టు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన యువతులను పట్టుకునేందుకు రెండు బృందాలు ఏర్పాటు చేశారు. పారిపోయిన యువతుల్లో ఎక్కువ మంది బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement