Monday, April 29, 2024

10 లక్షల విలువైన నిత్యావసర సరుకులు.. నిరుపేద ముస్లింలకు పంపిణీ

రంజాన్ పవిత్ర మాసంలో నిరుపేదలకు 10 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను సురభి మెడికల్ కాలేజ్ యాజమాన్యం అందజేసింది. గురువారం రాత్రి పెద్దపల్లి ఎంబి గార్డెన్స్ లో ఒక్కో కుటుంబానికి 25కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. సురభి వైద్య కళాశాల యాజమాన్యం రాంచందర్ రావు, మహేందర్ రావు, హరిందర్ రావులు పెద్దపల్లి లోని పేదలకు అందజేశారు. కార్యక్రమంలో హమీద్, మసూద్, ఆయాజ్, అజీజ్, ఫహీం, విజయేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement