Monday, April 29, 2024

మద్యం సీసాలు స్వాధీనం..

రంగారెడ్డి : ఆరు వందల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను హయత్‌నగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొహెడ్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద జాతీయ రహదారి 65పై పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ వైపు వెళ్తున్న కారు, ఆటోలో 600 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న దామోదర్‌, హరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా తెలంగాణలో మద్యం కొనుగోలు చేసి ఆంధ్రాలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు తక్కువ. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 6 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement