Saturday, May 4, 2024

ఏపీలో మళ్లీ 20 వేలు దాటిన కేసులు… కొత్తగా 89 మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గడం లేదు. రాష్ట్రంలో మళ్లీ 20 వేల పై చిలుకు కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 90,750 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 21,452 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారితో 89 మృతి చెందారు. కరోనా నుంచి మరో 19,095 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,97,370 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 90,750 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కరోనాతో అత్యధికంగా విశాఖ జిల్లాలో 11 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున వైరస్​కు బలయ్యారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారు.

మరోవైపు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,927 కరోనా కేసులు నమోదు అయ్యాయి. విశాఖ జిల్లాలో 2,238, అనంతపురం జిల్లాలో 2,185, చిత్తూరు జిల్లాలో 1,908, గుంటూరు జిల్లాలో 1,836, కడప జిల్లాలో 1,746, నెల్లూరు జిల్లాలో 1,689, కర్నూలు జిల్లాలో 1,524, శ్రీకాకుళం జిల్లాలో 1,285, పశ్చిమగోదావరి జిల్లాలో 1,232, ప్రకాశంలో 1,192, కృష్ణాలో 997, విజయనగరంలో 693 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు అవుతున్నా… కేసుల సంఖ్య 20 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మృతుల సంఖ్య కూడా ప్రతిరోజు పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement