Saturday, May 18, 2024

ఎపిలో కొత్త‌గా 21,452 క‌రోనా పాజిటివ్స్, 89 డెత్స్..

అమ‌రావ‌తి – ఎపిలో రోజు రోజుకి క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి.. అలాగే మ‌ర‌ణాలు అద‌పులోకి రావ‌డం లేదు.. గ‌డిచిన 24 గంట‌ల‌లో ఏకంగా 21,452 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 89 మంది కరోనా వల్ల మృతి చెందారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు (2,927) కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19,095 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,44,386 కేసులు నమోదు కాగా… 11,38,028 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 8,988 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారిగా న‌మోదైన కేసుల వివ‌రాలు
అనంత‌పురం 2185
చిత్తూరు 1908
తూర్పు గోదావ‌రి 2927
గుంటూరు 1836
క‌డ‌ప 1746
కృష్ణ 997
క‌ర్నూలు 1524
నెల్లూరు 1689
ప్ర‌కాశం 1192
శీకాకుళం 1285
విశాఖ‌ప‌ట్నం
విజ‌య‌న‌గ‌రం 693
ప‌శ్చిమ గోదావ‌రి 1232

Advertisement

తాజా వార్తలు

Advertisement