Tuesday, May 21, 2024

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ కాళ్లు మొక్కిన.. యెడ్యూర‌ప్ప కుమారుడు

బిజెపి సీనియ‌ర్ నేత‌..మాజీ సీఎం యెడ్యూర‌ప్ప కుమారుడు విజ‌యేంద్ర.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ప‌ర‌మేశ్వ‌ర కాళ్ల‌కి న‌మ‌స్క‌రించి..ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నారు. కాగా యెడ్యూర‌ప్ప‌కి కంచుకోట అయిన షికారిపుర నుండి విజ‌యేంద్ర పోటీ చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఆయ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో తుమకూరు సమీపంలోని యెడియూర్ లోని సిద్ధలింగేశ్వర ఆలయానికి ఆయన వచ్చారు. ఇదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, షెడ్యూల్డ్ కులాల నేత పరమేశ్వర అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పరమేశ్వర ఆశీస్సులను విజయేంద్ర తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా కొద్ది రోజుల్లో క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకోవ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement