Saturday, May 18, 2024

50 ఏళ్లు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేశారు – విప‌క్షాల‌కు కెటిఆర్ ప్ర‌శ్న‌..

హైద‌రాబాద్ – జవహర్‌నగర్‌లో దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన లీచెట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నేడు మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం 3,619 మంది లబ్ధిదారులకు జీవో నెం.58కింద పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి అభివద్ధి చేయలేదని.. అలాంటిది ఇప్పుడు అవకాశం ఇస్తే ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇటువంటి అబ‌ద్ద‌పు మాట‌లు చెప్పే పార్టీల‌ను, నాయ‌కుల‌ను న‌మ్మ‌వ‌ద్దంటూ పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement