Sunday, May 5, 2024

Breaking: వైసీపీ పని అయిపోయింది.. టీడీపీ అంటే వణుకు.. చంద్రబాబు

వైసీపీ పని అయిపోయిందని, టీడీపీ అంటే వైసీపీకి వణుకు పుడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటనలో ఆయన మాట్లాడుతూ… నా నియోజకవర్గం ప్రజలతో నేను మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పోలీసులు మైక్ ఎందుకు ఇవ్వరని అన్నారు. తన పర్యటన గురించి ముందే పోలీసులకు చెప్పానన్నారు. టీడీపీని చూస్తే జగన్ కు వణుకు పుడుతోందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలన్నారు. రాష్ట్ర ప్రజలకు బేడీలు వేయండని అన్నారు. వైసీపీకి, టీడీపీకి వేర్వేరు రూల్స్ ఉంటాయా అన్నారు. కుప్పంలో మీ ఆటలు సాగవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement