Wednesday, May 8, 2024

డబ్బులిచ్చిన వారికి ఓటు వేయొద్దన్న రఘురామ

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ పెద్ద మెజార్టీతో గెలవాలని.. లక్ష మెజార్టీ వచ్చినా ఓడిపోయినట్లే లెక్క అన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. తనపై కొందరితో బురదజల్లించే ప్రయత్నం చేస్తున్నారని.. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తనపై చీప్ ట్రిక్స్ ఎందుకని ప్రశ్నించారు. తనమీద పెట్టిన ఫోకస్ ఏదో తిరుపతి ఉప ఎన్నికపైపెడితే మంచిదని సూచించారు.

ఎన్నికల్లో డబ్బుల పంపిణీ చేయడం, డబ్బులు ఇవ్వడం ఓ దురాచారంగా మారిందన్నారు. రాజ్యాంగం ప్రకారం డబ్బులు తీసుకుని ఓట్లను అమ్ముకోవడం కంటే దారుణం మరొకటి లేదన్నారు. ఎవరైనా డబ్బు ఇచ్చిన వారికి ఓటేస్తే నేరస్తులే అవుతారని పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ వాళ్లు ఎవరు డుబ్బులు ఇచ్చినా వాళ్లకు ఓటు వేయొద్దని సూచించారు. మంచి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement