Friday, April 26, 2024

మాస్క్ వుంటేనే థియేటర్లోకి ప్రవేశం – డిఎస్పి వీర రాఘవ రెడ్డి

అనంతపురం క్రైమ్ – అనంత నగరంలోనీ థియేటర్లలో సినిమా చూడాలంటే ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించి ఉంటేనే చూసేందుకు ప్రవేశం కల్పించాలని డీఎస్పీ వీరరాఘవ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు స్థానిక డి ఎస్ పి కార్యాలయం నందు. థియేటర్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలోఅందరూ అప్రమత్తంవుండాలని . ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్క్ లేనిదే సినిమా థియేటర్లలోనికి అనుమతించరాదు.
టెంపరేచర్ గన్ ద్వారా ప్రతీ ఒక్కరిని చెక్ చేసి పంపాలి. సినిమా ప్రదర్శన ముగిసిన వెంటనే థియేటర్ లో శానిటైజ్చేయాలి. శ్యానిటైజర్ అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరంపాటించాలి. థియేటర్ల ప్రాంగణం, పరిసరాలలో జనం గుంపులుగా గుమిగూడరాదు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వన్టౌన్ సీఐ ప్రతాప్ రెడ్డి. శాంతి థియేటర్ మేనేజర్ ప్రసాద్. పలు థియేటర్ల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement