Monday, April 29, 2024

World Cup 2022, Ind Vs WI: స్మృతి, హర్మన్‌ సెంచరీలు.. వెస్టిండీస్‌ టార్గెట్ 318

ఐసీసీ మహిళా వన్డే కప్‌-2022లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మిథాలీ సేన అదరగొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్‌ సెంచరీ సాధించడంతో భారత్ అత్యధిక పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా శుభారంభం అందించారు. మంధాన 119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేసింది. యస్తికా 31 పరుగులు చేసింది. అయితే, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 5 పరుగులకే పెవిలియన్‌ చేరంది. ఇక, దీప్తి శర్మ 15 పరుగులకే అవుట్‌ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, మంధానతో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించింది. 107 బంతుల్లో 109 పరుగులు సాధించింది. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక మంధాన, హర్మన్‌ అద్భుత సెంచరీలతో ఆకట్టుకోవడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement