Monday, May 6, 2024

ప్రేమించి పెళ్లాడాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు… భర్త ఇంటి ముందు భార్య దీక్ష

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు వద్దంటున్నారంటూ భర్త ఇంటి ముందు ఓ వివాహిత ఆందోళన చేపట్టింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బట్టు తండాలో బాదావత్ అనిల్ కుమార్ ఇంటి ముందు అతని భార్య స్రవంతి ఆందోళన చేపట్టింది. చౌటపల్లి శివారు లచ్చ తండాకు చెందిన స్రవంతితో ఈ ఏడాది జనవరిలో అతనితో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే నెల 15 రోజులు కాపురం చేసిన అనిల్‌ కుమార్‌.. ఇప్పుడు తనను వద్దంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక గురువారం స్రవంతి తన భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తన భర్తే కావాలంటూ తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులు వేడుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement