Saturday, May 4, 2024

Kolkata : మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. మెట్రో రైలు వస్తుండగా దాని ముందుకు దూకి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. నార్త్ కోల్‌కతాలోని గిరీష్ పార్క్ స్టేషన్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దీంతో నార్త్-సౌత్ లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కబి సుభాస్-బౌండ్ రైలు వస్తుండగా రైలు ముందుకు ఆమె జంప్ చేసి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. ఆమె ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement