Sunday, April 28, 2024

నిర్ల‌క్ష్యం చేస్తోన్న భ‌ర్త – అమ్మ‌కానికి పెట్టిన భార్య‌

భార్య‌, భ‌ర్త అన్నాక గొడ‌వ‌లు రావ‌డం కామ‌నే. అయితే ఇక్క‌డో వ్య‌క్తి త‌న భార్య‌, పిల్ల‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నాడు. దాంతో విసుగుచెందిన ఆ భార్య , భ‌ర్త‌ని అమ్మ‌కానికి పెట్టింది. ఈ సంఘ‌ట‌న న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. అయితే అత‌నిని కొనుక్కోవ‌డానికి మ‌హిళ‌లు ఎగ‌బ‌డ‌టం విశేషం. కాగా న్యూజిలాండ్ లో నివ‌సించే లిండా మెక్ అలిస్ట‌ర్ అనే ఇల్లాలు త‌న భ‌ర్త జాన్ ని అమ్మ‌కానికి పెట్టింది. అందుకోసం ‘ట్రేడ్ మీ’ అనే వెబ్ సైట్ లో వేలం వేసింది. తన భర్తకు చెందిన పూర్తి వివరాలతో ప్రకటన ఇచ్చింది. వ్యవసాయం, చేపలు పట్టడం అతని వృత్తి అని చెప్పింది. అయితే, భార్య, పిల్లల కంటే అతడికి బీర్ అంటేనే ఇష్టమని తెలిపింది. విహార యాత్రలకు వెళ్లడం అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌.

గుణవంతుడే అయినా, కొన్ని సమయాల్లో తాగుతుంటాడని వివరించింది. కొనుగోలు చేయాలనుకున్న వారు వేలంలో పాల్గొనాలని పేర్కొంది. కాగా, లిండా తన భర్త జాన్ కనీస ధరను 25 డాలర్లని చెప్పింది. లిండా ఐర్లాండ్ జాతీయురాలు. ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజిలాండ్ లో నివసిస్తోంది. లిండా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం… ఓసారి అతగాడు భార్యను, పిల్లలను వదిలి చేపలు పట్టడానికి వెళ్లడమేనట. తమను అంత నిర్లక్ష్యంగా చేస్తున్న అతడిని వదిలించుకోవాలని లిండా వేలం వెబ్ సైట్ ను ఆశ్రయించింది. ఒకసారి కొనుగోలు చేసిన వారు తిరిగి ఇచ్చేయడం కుదరదని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement