Saturday, May 18, 2024

పశ్చిమ బెంగాల్ రాష్ట్రపతి పాలన విధించాలంటూ సుప్రీంలో పిటిషన్..

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలయింది. బెంగాల్ కు సైన్యాన్ని, పారా మిలిటరీ దళాలను తరలించాలని, పరిపాలనను సాధారణ స్థితికి తీసుకుని వచ్చి, ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంతో పాటు, అంతర్గత భద్రతపై దృష్టిని సారించి, జరిగిన హింసపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలయింది.

ఈ పిటిషన్ ను జస్టిస్ వినీత్ శరన్, దినోష్ మహేశ్వరి విచారణకు స్వీకరించారు. ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణల్లో నష్టపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో కూడా మమతా బెనర్జీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ ను రంజానా అగ్నిహోత్రి అనే యూపీ ప్రాక్టీస్ న్యాయవాదితో పాటు సామాజిక కార్యకర్త జితీందర్ సింగ్ దాఖలు చేయగా, వారి తరఫున న్యాయవాది హరి శంకర్ జైన్ వాదనలు వినిపించారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీకి మాత్రం వ్యక్తిగతంగా నోటీసులను ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి:అమ్మవారికి చెప్పుల దండ సమర్పించే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement