Sunday, April 28, 2024

మా సినిమా ఫొటోలు, సీన్స్ లీక్ అయితే ఇన్ఫ‌ర్మెష‌న్ ఇవ్వండి – ట్వీట్ చేసిన వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్

ఈ మ‌ధ్య‌కాలంలో లీకుల రాయుళ్లు ఎక్క‌వ‌య్యారు. కొత్త చిత్రాల షూటింగ్ స్పాట్ ల‌నుంచి పాటలు, ఫైట్ సీన్స్ ని లీక్ చేస్తూ ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌తో పాటు చిత్ర‌యూనిట్ కే స‌వాల్ విసురుతున్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేసింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. దీనిపై వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స్పందిస్తూ… ఆర్సీ15-ఎస్వీసీ 50 సినిమా షూటింగ్‌ అవసరాలకు అనుగుణంగా బహిరంగా ప్రదేశాల్లో చాలా మందితో జ‌రుగుతోందని తెలిపింది. ఆ స‌మ‌యంలో చట్ట విరుద్ధంగా వీడియోలు, ఫోటోలు తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయకూడదని కోరుతున్నామని పేర్కొంది. అనధికారికంగా కంటెంట్ ను పోస్ట్ చేసే వారి ఐడీలపై మా యాంటీ వైరస్ టీమ్ దృష్టి పెట్టి చర్య‌లు తీసుకుంటుందని హెచ్చ‌రించింది. మా టీమ్‌కు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌తి ఒక్క‌రినీ కోరుతున్నామ‌ని, ఏవైనా పైర‌సీ లింకుల‌ను గుర్తిస్తే [email protected]కు పంపాల‌ని కోరింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ న‌టిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్‌ రాజు, శిరీశ్ నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ స‌మ‌యంలో ఎవ‌రూ సెల్‌ఫోన్లు వాడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement