Sunday, April 28, 2024

ఏపీ సోదరుల ప్రేమతో పొంగిపోయా: KTR

తెలుగు రాష్ట్రాలుగా భౌగోళికంగా విడిపోయినా.. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ కుమారుడు సందీప్ వివాహానికి మంత్రి కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుక‌లో ఏపీ రాజకీయ ప్రముఖులతో పాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు కాంగ్రెస్ నాయ‌కులు శ్రీధ‌ర్ బాబు, సుద‌ర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. నూత‌న వ‌ధూవ‌రులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడ మంత్రి కేటీఆర్​ విభేధాలు పక్కనపెట్టి అందరు రాజకీయ ప్రముఖులతో కలివిడిగా, నవ్వుతూ మాట్లాడారు. ఏపీకి చెందిన నేతలతో ఆప్యాయంగా మాట్లాడారు. అంతేకాదు అక్కడికి వచ్చిన వాళ్లకు ఓపికగా సెల్ఫీలు కూడా దిగారు.

‘’ నిన్న ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి కుమారుడిని వివాహ వేడుకకు వెళ్లాను. ఏపీ నుండి వచ్చిన నా సోదరులు చూపించిన ప్రేమతో పొంగిపోయాను. భౌగోళికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపయి ఉండవచ్చు. కానీ, వ్యక్తిగత ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement