Tuesday, April 30, 2024

మహారాష్ట్రలో కూలిన గోడ.. 7కు చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్ర థానే జిల్లా భివండిలోని వల్పాడ ప్రాంతంలో శనివారం (ఏప్రిల్ 29) రెండంతస్తుల గోడౌన్ ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా.. 12 మందిని రెస్క్యూ టీం కాపాడింది. భవనం శిథిలాల కింద చిక్కుకున్న మిగతా క్షతగాత్రులను రక్షించేందుకు 2 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఆదివారం ఉదయం శిథిలాల కింది నుంచి సునీల్ పిసా(38) అనే వ్యక్తిని వెలికితీశారు. తీవ్రగాయాలపాలైన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకో 15 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని థానె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. బిల్డింగ్ ఓనర్ ఇంద్రపాల్ పాటిల్‌పై కేసు నమోదు చేసినట్లు భివండి పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement