Tuesday, May 7, 2024

మొబైల్ కొంటే – పెట్రోల్..నిమ్మ‌కాయ‌లు ఫ్రీ

ప్ర‌స్తుతం దేశంలో పెట్రోలు, నిమ్మ‌కాయ‌ల ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి.. ఈ నేప‌థ్యంలో వార‌ణాసిలోని ఆ దుకాణదారుడు వాటినే ఆఫ‌ర్లుగా ప్ర‌క‌టించాడు. దీంతో ఆయ‌న దుకాణానికి వినియోగ‌దారుల తాకిడి పెరిగింది. వారణాసిలోని మొబి వరల్డ్‌ షాప్ దుకాణదారుడు చేసిన ఈ ప్ర‌యోగానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి. వేసవి ప్ర‌త్యేక ఆఫర్లుగా అత‌డు త‌న స్టోర్‌లో రూ.10 వేలకుపైగా విలువైన ఫోన్ల‌ను కొనుగోలు చేస్తే లీటరు పెట్రోలు చొప్పున‌ ఉచితంగా ఇస్తాన‌ని పేర్కొన్నాడు. అలాగే, మొబైల్‌ ఫోన్‌ యాక్సెసరీస్‌పై 5 నిమ్మకాయలు ఇస్తాన‌ని బోర్డులు పెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement