Saturday, May 11, 2024

మరోసారి ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

ఇటీవల తరచూ తన వ్యంగ్యాస్త్రాలతో మీడియాలో కనిపిస్తున్న ఉత్తరాఖండ్ నూతన సీఎం తీరత్ సింగ్ రావత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని, వారికి ప్రభుత్వం ఇస్తున్న ఎక్కువ రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని చెప్పారు. ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం ఇస్తున్నామని, ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 50 కేజీలు అందుతున్నాయని తెలిపారు. 20 మంది కుటుంబ సభ్యులున్న వారికి క్వింటా బియ్యం వస్తోందని ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నవారు ఓర్చుకోలేపోతున్నారని వ్యాఖ్యానించారు. మీకు సమయం ఉన్నప్పుడు కేవలం ఇద్దరు పిల్లలను మాత్రమే కన్నారని… 20 మందిని ఎందుకు కనలేదని ప్రశ్నించారు.

మహిళల వస్త్రధారణపై కూడా కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికన్లు భారతీయతను పాటిస్తుంటే.. మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామన్నారు. ఆదివారం ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందని నోరు జారారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement