Thursday, May 2, 2024

సివిల్స్ ప్రిలిమ్స్​ పరీక్ష వాయిదా

కరోనావైరస్‌తో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూపీఎస్​సీ వాయిదా వేసింది. జూన్​ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్​ 10న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూపీఎస్​సీ గురువారం విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించింది.  సివిల్​ సర్వీసెస్​ పరీక్షలను ఏటా ప్రిలిమినరీ, మెయిన్​, ఇంటర్వ్యూ అని మూడు దశల్లో నిర్వహిస్తారు. ఇక సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 31న జరగాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది.

సివిల్ సర్వీసెస్ పరీక్ష మూడు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్స్ అటుపై ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది యూపీఎస్సీ. ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌ పరీక్షలు రాస్తుంటారు. ఇక ఈ ఏడాది దాదాపుగా 796 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీఎస్సీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement