Sunday, May 5, 2024

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర మంత్రి రావు సాహెబ్ దాన్వే – బ్రాహ్మ‌ణుడిని సీఎంగా చూడాల‌నుకుంటున్నా

ఓ బ్రాహ్మ‌ణుడ్ని మ‌హారాష్ట్ర సీఎంగా చూడాల‌నుకుంటున్నాన‌ని తెలిపారు కేంద్ర మంత్రి రావు సాహెబ్ దాన్వే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రావు సాహెబ్ పైవిధంగా స్పందించారు. ఓ ట్రాన్స్ జెండర్ అయినా సరే, మరెవరైనా సరే, ఏ కులానికి చెందినవారెవరైనా సరే… అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయిపోవ‌డం ఖాయ‌మ‌ని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. జాల్నాలో పరశురామ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బ్రాహ్మణులను కేవలం కార్పొరేటర్ల గానో, పౌర సంఘాల నేతలు గానో చూడాలనుకోవడంలేదు. ఓ బ్రాహ్మణుడు ఈ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడితే చూడాలనుకుంటున్నామ‌న్నారు. అంతేకాదు, తాను ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశానని, రాజకీయాల్లో కులతత్వం తీవ్రస్థాయిలో ఉన్న విషయం గుర్తించానని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement