Saturday, May 4, 2024

కేంద్రమంత్రికి త‌ప్పిన ముప్పు

ఆగ్రాలోని భీంన‌గ‌రి ప్రాంతంలో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగిస్తోన్న స‌మ‌యంలో ఈదురుగాలులు వీచాయి. దాంతో లైట్లు అమ‌ర్చిన ఓ భారీ ఇనుప స్తంభం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో స్టేజీపై ఉన్న రాజేశ్ కుమార్ (50) అనే స్థానికుడు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మాజీ ఎమ్మెల్యే గుటియారి లాల్ దూబేష్, ఆయన డ్రైవర్ కూడా ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి సురక్షితంగా తప్పించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement