Tuesday, April 30, 2024

మహారాష్ట్రలో కరోనా కట్టడికి కఠిన నిబంధనలు విధించాలన్న కేంద్రం


అంతా అనుకున్నట్లే జరుగుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఘంటికలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు తీవ్రతే దీనికి ఉదాహరణ. ఇక మహారాష్ట్రలో అయితే ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా కేంద్రం సంచలన విషయాన్ని వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని… అది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని చెప్పింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం…ముందస్తుగానే కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పడదని లేఖలో హెచ్చరించారు రాజేశ్ భూషణ్. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనాను గుర్తించడం, టెస్టింగ్, ఐసొలేషన్ (ట్రాక్, టెస్ట్, ఐసొలేట్) వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపట్టడం లేదని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తోందని… అయితే, దీనికి తగ్గట్టుగా గట్టి చర్యలను తీసుకోవడం లేదని చెప్పారు. ఇక పై కోవిడ్ నిబంధనల గతంలో మాదిరిగానే అమలు చేయాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement