Sunday, May 5, 2024

Delhi: మెడికల్ విద్యార్థుల నిరాహారదీక్ష

దేశ రాజధాని ఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ విద్యార్థుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. రామ్ లీలా మైదాన్ లో రెండో రోజు నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఉక్రెయిన్ లో ఆగిన వైద్య విద్యను దేశంలో చదివేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో అడ్మీషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఈ దీక్షలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా అక్కడికి వెళ్లలేమని.. ఇక్కడే ప్రభుత్వ కళాశాలల్లో తమ వైద్య విద్యకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement