Saturday, May 4, 2024

రెండు రైళ్లు ఢీ.. లోకోపైల‌ట్ మృతి.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

ఎదురెదురుగా వ‌స్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఓ లోకోపైల‌ట్ మృతి చెందాడు. మ‌రో ఐదుగురు గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం మధ్యప్రదేశ్‌లో శాహ్‌డోల్ జిల్లాలో చోటు చేసుకుంది.కాగా సింగ్‌పూర్‌ రైల్వే స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం 6.45 గంటల సమయంలో సింగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ గూడ్సు రైలు ఆగింది. అదే ట్రాక్‌పై వచ్చిన మరో గూడ్స్‌ ట్రైన్‌ దానిని ఢీకొట్టింది. దీంతో ఒక రైలు బోగీలు.. మరో దానిపై పడ్డాయి. దాంతో ట్రాక్‌ మొత్తం ధ్వంసమైపోయింది. ప్రమాదం ధాటికి రైలింజన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రాజేశ్‌ ప్రసాద్‌ గుప్తా అనే లోకోపైలట్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు గుర్తించారు. మరో ఐదుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బిలాస్‌పూర్‌-కట్నీ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement