Sunday, May 5, 2024

Jharkhand: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. జార్ఖండ్‌లోని సెరియకేలా-ఖర్సవాన్‌ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఉదయం బరుడా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా, జార్ఖండ్‌ జాగ్వార్‌ దళాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు సీపీఐ మావోయిస్టులు మరణించారని కొల్హాన్‌ ఐజీ అజయ్‌ లిండా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement