Monday, May 6, 2024

Breaking: బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు మృతి

బొలెరో వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా ప‌రిధిలో చోటుచేసుకుంది. పూడూరు మండల పరిధిలోగల చీలాపూర్ పెట్రోల్ బంక్ వద్ద బొలెరో వాహనం ఢీకొని మేడికొండ గ్రామానికి చెందిన యాదిరెడ్డి (58) సాకలి రవి (28) బైక్ పై మన్నెగూడ వైపు వస్తుండగా అతి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. సంఘటన స్థలానికి పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకట రమయ్య చేరుకొని యాక్సిడెంట్ కు సంబంధించిన వివరాలను స్థానికులతో అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement