Monday, May 27, 2024

కేంద్రంపై టీఆర్ఎస్ మరో పోరు..నేడు బ‌య్యారం ఉక్కు నిర‌స‌న దీక్ష

కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రో పోరాటం చేయ‌డానికి అధికార పార్టీ టీఆర్ఎస్ సిద్ధం అవుతుంది. గతంలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. తాజాగా బయ్యారం కోసం ఆందోళన బాట పట్టింది.విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న బ‌య్యారం ఉక్కు ఏర్పాటు గురించి కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాటం చేయ‌నున్నారు. బ‌య్యారం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న దీక్ష చేయ‌నున్నారు. బ‌య్యారం ఉక్కు ప‌రిశ్ర‌మ ఇక రాద‌ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో టిఆర్ఎస్ ఈ ఆందోళన నిర్వహిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement