Tuesday, April 30, 2024

Breaking: నిజామాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ

నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు పార్టీ కార్యకర్తలతో వెళ్లడానికి బీజేపీ ఎంపీ అర్వింద్ సిద్ధమయ్యారు. అయితే, అర్వింద్‎ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాల చేశారు. దీంతో వారికి పోటీగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరుపార్టీల కార్యకర్తల ఘర్షణతో పలువురు గాయపడ్డారు. వీరులో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటచేసుకోవడంతో దర్పల్లిలో భారీగా పోలీసుల మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement