Tuesday, April 30, 2024

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం.. రూట్ మ్యాప్ ఇదే!

హైదరాబాద్​లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. శనివారం అర్దరాత్రి నుంచే నగరంలోకి అంతర్​ రాష్ట్ర, జిల్లాల వాహనాలపై ప్రవేశాన్ని నిషేధించనున్నారు. పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేశ్ నిమజ్జన యాత్ర మీదుగా రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు.

గణపతి నవరాత్రోత్సవాలు భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహిస్తారు. వినాయక నిమజ్జనం రోజు హైదరాబాద్‌లో రోడ్లన్నీ బంద్‌ అవుతాయి. ప్రత్యేకంగా పోలీసు డిపార్ట్‌మెంట్‌ వినాయక నిమజ్జనం కోసమే రూట్‌మ్యాప్ తయారు చేస్తుంది. ప్రతియేడూ మాదిరిగానే ఈయేడాది కూడా రూట్‌ మ్యాప్‌ విడుదల చేశారు. దారి మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలను గూగుల్ మ్యాప్​తో అనుసంధానమై ఎప్పటికప్పుడు అప్​డేట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

బాలాపూర్, ఫలన్​నుమా నుంచి వచ్చే శోభాయాత్రలను చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మార్గ్​కు తరలిస్తారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర.. ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగూడ, ముషీరాబాద్ కూడలి, హిమాయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు మళ్లించనున్నారు. ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర.. రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. దిల్​సుఖ్​నగర్, ఐఎస్​ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర.. సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement