Thursday, May 9, 2024

టీడీపీ నేతలకు ఏపీ గవర్నర్ అపాయింట్ మెంట్

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడికి సంబంధించి టీడీపీ నేతలు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరగా.. ఆయన ఖరారు చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు టీడీపీ నేతలకు ఆయన అపాయింట్ మెంట్ ను ఇచ్చారు. చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘర్షణపై పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్ కు వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, ఆలపాటి రాజా, అశోక్ బాబులతో కూడిన టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేయనుంది.

కాగా, నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడించారు. దీంతో టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement