Friday, May 3, 2024

ఫిల్మ్ నగర్ క్లబ్‌లో టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ.. ఇండస్ట్రీ సమస్యలపై చర్చ!

హైద‌రాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి చెందిన 24 క్లాఫ్ట్స్‌ సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ స‌మావేశానికి మొత్తం 240 మంది సభ్యులకు ఆహ్వానం అందిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో సమావేశం అయిన తర్వాత జరుగుతున్న ఈ కీలక సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. సమావేశంలో సినీ పరిశ్రమ సమస్యలు, సిని కార్మికుల వెల్ఫేర్ పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న అనేక ఆటంకాలతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

ఇప్ప‌టికే ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌కు వ‌చ్చిన వారిలో నిర్మాత‌లు సి.క‌ల్యాణ్‌, ప్ర‌స‌న్న కుమార్, త‌మ్మారెడ్డి, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌దిత‌రులు ఉన్నారు. సినీ కార్మికుల సంక్షేమంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం నుంచి ముందడుగు పడిన నేప‌థ్యంలో దీనిపై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement