Thursday, May 2, 2024

Breaking : మంత్రి సాధన్ పాండే మృతి – మమత బెన‌ర్జీ సంతాపం

పశ్చిమ బెంగాల్ మంత్రి సాధన్ పాండే నేడు ముంబైలో కన్నుమూశారు. ఆయన వ‌య‌స్సు 71ఏళ్లు..గతేడాది జూలైలో మంత్రి సాధన్ పాండే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో ఆయ‌న స‌త‌మ‌త‌మ‌య్యారు..దాంతో మంత్రి ఆరోగ్య పరిస్థితి విష‌మించ‌డంతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో వెంటిలేటర్‌పై ఉంచారు. ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ముంబైకి తరలించగా, దురదృష్టవశాత్తు నేడు తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతిపై సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. మా సీనియర్ సహోద్యోగి, పార్టీ నాయకుడు , క్యాబినెట్ మంత్రి సాధన్ పాండే నేడు ముంబైలో కన్నుమూశారు. చాలా కాలంగా ఆయ‌నతో మాకు అనుబంధం ఉంద‌ని. ఆయ‌న మ‌ర‌ణం బాధాక‌ర‌మ‌ని ఆవేదన వ్య‌క్తం చేశౄరు.. సాధ‌న్ పాండే కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాన‌ని ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement