Thursday, May 2, 2024

టాలీవుడ్ లో – బాలీవుడ్ భామ‌ల ఎంట్రీ

టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌నున్నారు ప‌లువురు న‌టీమ‌ణులు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచ‌యం అవుతోంది. ఇక లైగ‌ర్ ద్వారా అన‌న్య‌పాండే, ఏజెంట్ చిత్రం ద్వారా సాక్షి వైద్య, ‘గని’ మూవీతో సైయీ మంజ్రేకర్ పరిచయం కానున్నారు. దాంతో ఈ సినిమాల పట్ల ప్రేక్షకులు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. సైయీ మంజ్రేకర్ విషయానికి వస్తే ఆమె వరుణ్ తేజ్ జోడీగా ‘గని’ సినిమా చేసింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 8వ విడుదల కానుంది. ఈ సినిమాలో తన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందనీ, ఈ పాత్ర తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని సైయీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement