Thursday, April 25, 2024

Breaking: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలకు అనుమతి

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి భక్తులను అనుమతించకుండా ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నారు. కరోనా  ఉద్ధృతి తగ్గడంతో రెండేళ్ల తర్వాత తిరిగి భక్తులకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ , మే, జూన్  నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20 వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ వెబ్ సైట్ తో ఆర్జిత సేవా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement