Saturday, May 4, 2024

భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన – టిప్పు సుల్తాన్ చిత్రాలు

రూ.6.27కోట్ల‌కి అంటే 6.30ల‌క్ష‌ల పౌండ్ల‌కి అమ్ముడుపోయాయి అప్ప‌ట్లో వేసిన చిత్రాలు. 1780లో ఈస్టిండియా కంపెనీపై హైదర్ అలీ, అతడి కుమారుడైన టిప్పు సుల్తాన్ సాధించిన విజయానికి గుర్తుగా అప్పట్లో వేసిన చిత్రాలకు తాజాగా మంచి ధర పలికింది. 242 సంవత్సరాల క్రితం సెప్టెంబరు 10న ఆంగ్లో-మైసూరు యుద్ధం జరిగింది. దీనినే ‘ది బ్యాటిల్ ఆఫ్ పొల్లిలూర్’గా పిలుస్తారు. ఈ యుద్ధంలో సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోయేలా టిప్పు సుల్తాన్ స్వయంగా పెయింటింగ్ గీయించారు. 32 అడుగుల పొడవున్న ఈ పెయింటింగ్‌ను లండన్‌లోని సదబీస్ ఆక్షన్ హౌస్‌‌లో వేలానికి ఉంచారు. వరల్డ్ అండ్ ఇండియా విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement