Monday, April 29, 2024

విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ఉద్యమిస్తాం

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యరద్శి రామకృష్ణ. చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెరిగితే బాదుడే బాదుడు అన్నారని అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ప్రతిపక్షాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్ర పెద్దలకు తొత్తుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ ఆదానీ సోలార్ కంపెనీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి వారితో ఒప్పందాలు చేసుకున్నారని రామకృష్ణ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement